KakatiyaPatrika.com Header Image

The Writer and his Integrity

Introduction:

The following are some notes written by Sri Pamulaparthi Sadasiva Rao based on the original essay by Per Wästberg. Per Wästberg, Swedish poet, novelist and journalist, was born in 1933. Today President of International PEN, he has been Chief Editor of the Dagens Nyheter daily (1976-82), having worked as literary critic and columnist for the paper since 1953. Co-founder and Vice-President of Swedish Amnesty (1964-72), he has been Secretary of the Swedish Defence and Aid Fund for Southern Africa, which he also co-founded, since 1959. Since 1983 a board member of the Swedish Institute for African Studies. Has published 12 works of fiction and 18 non-fiction, the most recent being a novel, En avldgsenlikhet (‘A Distant Affinity’), 1983. You can buy the original article at the Infoworld.

“Probe beneath the aged information, and pose challenging questions, in search of essential Human truth.” – Wästberg

The Writer and His Integrity by Per Wästberg –         Pamulaparthi Sadasiva Rao

There are innumerable hindrances in the way of freedom of expression of a writer. Literature is on a collision course with authoritarians who obstruct the freedom of the people by neglecting or belittling their experiences of life. So, a writer has to uphold the values arising out of private lives of people and make them realize that they are not powerless, in expressing their experiences and facing the life’s problems.

The censor fears the unconventional and divergent view of expression of the writer- in his portrayal of characters and situations and values. The author with his criticism and exposition of something that is taboo in the normal set-up, is feared and treated with mistrust. Art and literature that try to break new ground are not much relished by the censorship that believes in its own autocracy and in the unworthiness of private men and their private views on social justice, claiming their acceptance, in general.

Authorities side-track the verdicts of the artist due to their fanatic notion, that they (authorities) never make mistakes. They uphold their own versions of social planning and interpret history according to the opinions of the powers of the day- that are taken as exclusively legitimate. So, sufferings may not be portrayed by the writer as they go against the wisdom of social planning at the hands of set establishment.

The vocabulary of the establishment with its own way of jargon, due to abstraction and euphemist colors, treats the plain language of the writer as unqualified. Concrete sensual words arising out of every day use, of the people degraded and side-tracked with official versions. Thus, existence is made a cage…

Freedom of expression requires innovative, unfrozen and living language, with vivid boldness that can catch. Literature does not need its freedom, as it has freedom in itself. It should be dynamic like an unruly child, above control and fearless in spite of alarming consequences or restlessness. Work of art should liberate the soul, and lift it to new heights of comprehension.

The metaphor and the image coined by the author often leads to hostile official reaction, due to its diversity and contrast, and as a threat to the law and order as  viewed by authority. Published tone is social action in itself, as the inner feeling gets publicized. The writer has no secrecy to hide and so the controllers get perturbed, with nothing left for them to peer through the windows of surveillance and to resort to preventive action.

Writers side the powerless and the weak and expose victim’s action caused through arbitrariness of the authority. They sing no songs in praise of oppressors for their dark tricks. A writer seeks power for his influence on his readership. A writer is aware of the attraction of his power and also of the life in the shadow of power.  He is a rival to the politician. He seeks after weight of his words, a force to influence. A writer feels that he is above the set-up intending to change the society, for its better. He is not a neutral mirror to reflect the society as it is, once for all. He comments on the sickness of the society, which the authority does not tolerate. Conservative power blames this mirror, as if it ‘lies’ and dictatorship often outlaws for desirability. Democracies call it a tool of biased presentation –negligible and not worthy of recognition. They demand conformity of the writer by either fear, if not favor….

The writer is thus against all odds. He is often under isolation or persecution at the hands of the rulers which believes in common good through its common lies. Sometimes a writer may compromise with circumstances. Then, he is subject to commitment for the sake of his safety. But this commitment is external and conditional, leading to the inner freedom to prevail, when so possible or desirable. Commitment may be an adjustment with the surroundings for self-security or an organized group of powerful persons conducive to the original vision of the writer, which has to prevail ultimately.

A writer tries to debase such hypocrisy of the rulers and resists adamant bureaucracies. A writer thus stands alone and without his orchestrators.  Yet, he is honest to face the world and to impress the minds of the people, ultimately.

To resist official decrees and court arrests for the sake of this conscience is not always very easy. So, the writer’s right to publish his private view of situations with due emphasis is a duty courageous enough. A writer requires freedom from social conformism of all kinds- both politically and morally; to provide which is a condition under necessary for any form of free and just society.

Freedom from conscience is the freedom of private expression as perceived of the situations, by the writer. He portrays the situations as he sees them. This is above the demands of loyalty and unity in the name of the nation that leads to anti-literary censorship or self- censorship. There is  no total unity – national or international- which concept is nothing but one’s own prison camp. The privacy of literature and art is a personal freedom of the writer, quite inviolable of expression. National, political and other group versions of views taken as established truths are challenges for literature to take the voice of personal experience and as a hard fact claiming its due recognition.

Literature is not a branch of sociology. It does not aim to abolish tyrannies. Tyrannies will be gone but literatures remain. Literature is considered to be subversive though it may not arouse the people against the authority of oppressors. Literature exists as a record of free expression of longing and hatred of men under given life conditions.

Governments in modern world are never to be fully trusted. Big powers can not claim allegiance to them on the name of patriotism, in the present nuclear bomb age. Governments want to control the people through their security forces, equipped with refined arms of destructive nature, with the version that its control is for the betterment of the people. Some countries behave as if they are under the danger of external siege and demand restrictions on the free expression of the writer. So, it becomes necessary for the writer to probe beneath the surface of biased information, which function goes against the views of the powers that be. So, official propaganda is let loose pressing for frightened or forced conformism by writers, which is barbarity, with a new guise. This restricts the freedom of the writer – as the trouble. [This] should not be allowed to lead to dictatorship – of the mass grave. But regimes have their own inner contradictions and weaknesses. They fear of their own breakdown. They can not crush down the dance of freedom and its possibilities, in the world set-up of this day. A writer may seek asylum and carry on his version, as a matter of right.

All sorts of persons can be elected to power and they often misrule. That is why the ‘term of power’ is to be adhered strictly. They are used to tactics and strategy and propaganda; styles of cooked up thoughts of expression. They rule out plain truths through many pretexts and excuses and divert public notice for the sake of their own privileged order / functioning. They resort to prohibitive orders and curtailment of fundamental rights on the name of stability of the government and its law and order which device is designed for their own convenience. They have seized to be the divine protectors of the helpless masses but they never admit it. Big brother type of governments even resort to heinous crimes against the people of their hostile countries under official secrecy of spy organizations. They resort to measures of grave pressures of intimidation, through the use of modern destructive war weapons against innocent people and yet want to go scot-free. They instigate rebellions and civil wars in other lands, if so felt necessary.

Original Notes of Sri Sadasiva Rao

భూమాత

Courtesy: కోవెల సువ్రసన్నాచార్య

పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్క్సియ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమ్యూనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమ్యూనిస్టుల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.

నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము
పుడమితల్లికి పూజచేద్దాము
వీరాధివీరులౌ శ్రీరామచంద్రులను
కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను
జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను
కన్నతల్లికి హారతిద్దాము
కన్నీరు కడిగి పూజిద్దాము
నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల . . . .
పాలునీరుగ మనము కలసి పోయిననేల
కలసి పోయిన మనము కరగిపోయిననేల
జంట నాగళ్లతో బీళ్లు దున్నిన నేల
నీళ్లు గొట్టిన నేల కాపుగాచిన నేల
రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల
గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి
శాంతి ఆయుధముతో స్వాతంత్య్రపథములో
సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి
ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి
కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల
చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల
మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల
నిండ నూరేండ్లయి కండ్లుమూసేటపుడు
పట్టుపాన్పులాంటి గుండెపై జోకొట్టి
జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే. 42,43)

తమ ఉద్యమం రోజుల్లో `దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషూలోయ్‌’ అన్న గేయాన్ని `వందేమాతరం’ గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమ్యూనిస్టులు వాడుకున్నారు. ఈ గేయం సంస్కరణోద్యమాన్ని బలపరచేది. స్వాతంత్య్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్య్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన ఔన్నత్యాలు ప్రేరకాలు. దేశం ఒకవిధంగా జగన్మాతృ రూపమైంది. గురజాడ ఆంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, `మంచిగతమున కొంచెమేనోయ్‌’ అన్నవాడు. పాములపర్తి సదాశివరావు రచన కమ్యూనిస్టులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పథాన్ని ఎత్తిచూపింది. గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.

పాములపర్తి సదాశివ రావు

శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. ఆనాటికి చిన్న చిన్నగా పద్యాలు రాస్తూ కాకతీయలో ప్రచురణ కోసం ఒకసారి ఒక రచన అందించి వచ్చాను. (అయితే అది ప్రచురించబడలేదు.) ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంలో నేనూ, పి.ఎన్‌. స్వామి, ఉదయరాజు రాధాకృష్ణ ముగ్గురమూ ఒక ప్రత్యేక సంచిక వెలువరించ బూనినప్పుడు దానికి సంపాదకత్వ భారాన్ని వహించి నాటికి చాలా అందంగా విశిష్టంగా ప్రచురించారు. దానిలో ఆయన కాకతీయ శిల్పం గురించి ప్రత్యేక వ్యాసం వ్రాశారు. నేను అప్పటికి హైదరాబాదులో బి.ఎ. చదువుకుంటున్నాను. నా చేత ప్రత్యేకంగా దానిలో ప్రచురణ నిమిత్తం `స్థానిక సాహిత్య సమీక్ష’ అనే పేర వరంగల్లు జిల్లా సాహిత్య వికాసం గురించి చక్కని వ్యాసం వ్రాయించారు. దానిలో చివరకు నేను మరిచిపోయిన నాలుగైదు పేర్లను చేర్చి వ్యాసాన్ని సమగ్రం చేశారు. అప్పటి నుంచీ ఆయనతో నా పరిచయం కొనసాగింది. `తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు’, చరిత్ర, సంస్కృతి, కళ’, `జ్ఞాన సిద్ధాంతం’, `భారతీయ సాహిత్య పరిణామాలు పరిశీలన’ మొదలైన పరిశీలనాత్మకమైన రచనలే కాకుండా `అభ్యుదయ గేయాలు’ అనే కవితా సంపుటి కూడా ఆయన రచనలలో ఉన్నాయి. కాకతీయలో సంపాదకీయాలు, ఇతర రచనలు, ఇతరుల పేర్లతో వచ్చిన రచనలు అన్నీ విలువైనవే. విశ్వజ్యోతి మొదలైన పత్రికలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగాయి. వాటిల్లోనూ ఎక్కువ పాలు ఆయన చేతి రచనయే. శ్రీ సదాశివరావు పర్వతం వలె గంభీరుడే కానీ కదలకుండా ఒకే బిందువు వద్ద స్థాణువుగా నిలిచి పోలేదు. ఆయన జీవలక్షణం జిజ్ఞాస. ఒక భావనకు ఒక సిద్ధాంతానికి కట్టుబడి తన జీవితాన్నంతా ప్రశ్నించకుండా సాగిపోయిన వ్యక్తి కాదు ఆయన. ఆ పర్వతం కరిగి గంగయై ప్రవహించింది. అనేక సంస్కృతులను నాగరికతలను కాలఖండాలను స్పృశించింది. అనేక ఉపనదులను తనలోనికి సమావేశింప జేసుకున్నది. కమూ్యనిస్టు పార్టీ పక్షాన `సందేశం’ పత్రికకు సంపాదకులుగా బౌద్ధం గురించీ, శాంకరాదై్వతం గురించీ రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించారు. వీటిల్లో శాంకరాదై్వతం గురించిన పత్రిక ప్రతులను బేదాభిప్రాయాలు కారణంగా తగులబెట్టినారని వారికి మిక్కిలి సన్నిహితుడు నాకు ఆప్తమిత్రుడైన శ్రీ పి.ఎన్‌. స్వామి చెప్పారు. 1957 ప్రాంతం నుండి సదాశివరావులో మార్కి్సస్టు తత్త్వం విశ్లథమవుతూ వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఆయన ప్రచురించిన `అభ్యుదయ గేయాల’లో ఈ విశ్లథ దశ స్పష్టంగా గోచరిస్తుంది. దీనిలోని `భూమాత’ అన్న రచన జాతీయ చైతన్యానికి, ఉజ్జ్వలమైన గతానికి హారతులెత్తింది. `శాంతి ఆయుధంలో స్వాతంత్య్ర పథంలో సామ్రాజ్య రాక్షసిని సంహరించిన భూమి’ `శూరాధి శూరులౌ రాజులేలిన భూమి’ `యోధాను యోధులై పోరుసల్పిన భూమి’ `వీరాధి వీరులౌ శ్రీరామ చంద్రులను’, `కారుణిక మూర్తులౌ శాక్య గౌతములను’, `శృంగార రూపులౌ రాధా మాధవులను’, `జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను’ గన్న తల్లికి పూజ చేద్దాము’ ఇవన్నీ ఈ కవితలోని పంక్తులు. `గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళు్ళలతో, అన్నా `మంచి గతమున కొంచెమేనోయ్‌’ అన్నా ఆ కవుల దృష్టికి సదాశివరావు దృష్టికి ఎంత భేదం ఉన్నదో గుర్తించడం అవసరం. చైనా దురాక్రమణ సందర్భములో ఆయన విశ్వజ్యోతి’ ప్రత్యేక సంచికలో చైనా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ వ్రాసిన వ్యంగ్యరచన నాకింకా స్పష్టంగా గుర్తే ఉంది. అప్పుడు అభ్యుదయ కవులెవరూ నోరు విప్పలేదు. శాక్యముని అన్న రచనలో `2500 ఏండ్లు గడిచిపోవనిప్పుడు తిరుగవచ్చినావ సర్వానికి మిన్నయైన జనయిత్రిని భారత మాతను చూడగ’ భారతమాతను సర్వానికి మిన్నయైన జనయిత్రిగా ప్రస్తుతించారు. అందువల్లనే ఆయన `మానుషత్వము బోధింపు కానీ భావమానుషత్వమును కాదు. సత్యధర్మముల కీర్తింపును కానీ ఊహా సిద్ధాంతములుగ మాత్రం కాదు.’ అని ఆచరణ ప్రాథమ్యాన్ని తెలుపుతూ సిద్ధాంత మౌఢ్యాన్ని తిరస్కరించారు. తరువాత తరువాత ఆయన అధ్యయన పరిధులు విస్తరించాయి. విశ్వ వ్యాప్తంగా వచ్చిన సామాజిక, ఆర్థిక, తాత్తి్వక, రాజకీయ సిద్ధాంతాలు, సాహిత్య, సంగీత, చిత్ర, శిల్పాదులు, విజ్ఞాన శాస్త్రాంశాలు, ఒకటేమిటి ఏదైనా ఆయన అధ్యయనంలో భాగమే అయింది. భరతుని సంగీత సిద్ధాంతం, విద్యారణ్యుల వేదశాస్త్ర పరిశోధన గ్రంథాలు, సూఫీవాదం భారతీయ చరిత్ర పునర్విలోకనం, భాగవత సంప్రదాయం ఇలా ఎనై్ననా ఆయన విచారణ పరిమితిలో నూతన కాంతులను సంతరించుకున్నాయి. వరంగల్‌ నగరంలో ఎనభైలలో మొదట పోతన పంచశతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో జరగటానికి, చివర్లో విద్యారణ్యులను గురించిన సంగోష్ఠూలు నిర్వహింప బడటానికి ఆయనే మూలకారణం అనడం సత్యోక్తి. ఈ రెండు సందర్భాలలోనూ ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ కారణంగా ఆయనతో కొన్ని నెలలపాటు, ఏండ్లపాటు అధ్యయనంలో, చర్చలలో, కార్యనిర్వహణలో పాల్గొనగల్గటం నా అదృష్టమనే చెప్పాలి. చివరి రోజులల్లో డాక్టర్‌ రాజారాం గారి తోటలో సుమారు రెండు వందల ఉపన్యాసాలు భారతీయ చరిత్రను గురించి ప్రపంచ తాత్తి్వకుల గురించీ ్టవులను గురించీ చేసిన ప్రసంగాలు అమూల్యమైనవి. వాటిని సంపాదించి ఎడిట్‌ చేసి ప్రచురించగలిగితే ఒక నూతన భాండాగారం వివృత కవాటం అవుతుంది. శ్రీ అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి దాకా ఆయన స్పృశించని అంశం ఉండేది కాదు.

(Courtesy: Sri Kovela Suprasanna Charya gari blog at http://samparayam.blogspot.com/2009/02/blog-post_16.html )

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

( ఈ క్రింది వ్యాసం శ్రీ టీ. శ్రీరంగస్వామి గారి సంపాదకత్వంలో, శ్రీలేఖ సాహితీ వారిచే ప్రచురింపబడిన “ఏకశిలా వైతాళికులు” అనే 1991 ముద్రణ లో శ్రీ పల్లేరు వీరస్వామి (నాగారం, పరకాల) గారిచే వ్రాయబడినది. )

ఆలోచనల నేస్తూ ఆచరణలలో అమలు పరుస్తూ ఆర్భాట పటాటోపాదులను తూర్పారబడుతూ, ఆడంబరాలకు దూరంగా మసలుతూ, ప్రాలుమాలకుండా సోమరితనాన్ని వదలి అనుక్షణం తన పనితాను సాగిస్తూ, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచినా, కీర్తి కండూతి లేని విజ్ఞానమూతి పాములపర్తి. వీరిని సదాశివ రావు అనడం కన్నా సదాశాయ రావు అంటే బాగుంటుందేమో!

మనిషి పీలగా ఉన్నా, మేలైన ఆలోచనలతో కార్యదీక్షాదక్షుడైనాడు. నిరాడంబరతతో దర్శనమిచ్చినా, లోకాన్ని తన మేధతో స్పర్శించడం, తన కలంతో నిజాల్ని, నిగ్గుల్ని వర్షించడం, ఉపన్యాసాలతో ఆకర్షించడం చేస్తారు.

వరంగల్లు (మట్టెవాడ ) లో 1920 సం|| న జన్మించిన వీరు హన్మకొండ కాలేజేట్ హైస్కూలులో విద్యాభ్యాసం గావించారు. విద్యార్ధి దశలోనే చురుకైన ఆలోచనలు గల్గిన చురుకైన విద్యార్ధిగా గుర్తింపబడ్డారు. అప్పుడు హైదరాబాద్ రాజకీయ వాతావరణం భయానంకంగా ఉండేది. ‘ఆజాద్ హైదరాబాద్’ నినాదాలు విజ్రింభించేయి. వాటికి తోడు రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల హా హా కారాలు మిన్ను ముడుతుoడేవి. కదిలి అదిలించే మనస్తత్వం గావున విద్యార్ధి దశలోనే జాతీయోద్యమ ప్రభావ ప్రేరిరుతుడై ఇంటర్మీడియట్ స్థాయి లో కాలేజీని బహిష్కరించి నాగపూరులో తన చదువు కొనసాగించారు.

ఆంద్ర మహా సభ, గ్రంధాలయోద్యమం, ఆర్య సమాజ్ ఉద్యమాలలో పాల్గొని సాహిత్యం, కళలను ప్రోత్సహించారు. ప్రజలలో పోరాట స్ఫూర్తిని, దీప్తిని కలిగింపచేసారు. ఆనాటి పారతంత్ర్య దుర్గతిని ఎదిరించుటకై అతివాదం అవసరమని నమ్మి స్వాతంత్ర్య సమరంలో అజ్ఞాత పోరాటానికి విద్యార్ధులను, యువకులను మరెందరినో ప్రేరేపించారు.

1944 లో ఓరుగల్లులో కాకతీయ కళాసమితి నేర్పాటు జేశారు. వార్షికోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారు. సాహిత్య కళా పోటీలను కూడా నిర్వహించి ఎందరో ఆనాటి యువకులుకు ప్రోత్సాహాన్ని కలిగించారు. కాళోజి నారాయణ రావు, కాశీనాధం, వెంకట రామారావు, గార్లపాటి రాఘవరెడ్డి మున్నగు మహామహులెందరో కళా సమితికి బాసటగా నిలిచారు, భాగస్వములైనారు. వీరు వరవిక్రయం, రామదాసు, మధుసేవ, ప్రతాపరుద్రీయం, తెలుగుతల్లి, చింతామణి మున్నగు ఉత్తమ నాటకాల్ని కూడ ప్రదర్శించారు.

సంగీత రంగాన్ని కూడా వీరెంతో అధ్యయనం జేశారు. ఎన్నో గాన సభలను నిర్వహించారు. ఆ కళామతల్లికి కైమోడ్పుగా యెందరో గాన విద్వాంసుల గోష్ఠులు నిర్వహించి అనేకులకు సన్మానాల నేర్పాటుజేశారు. ఆ విధంగా సన్మానిమ్పబడిన వారిలో ద్వారం వేంకటస్వామినాయుడు గారు, బాల మురళీకృష్ణ గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, టి.టి. సీత గారు, పల్లవి సరస్వతి గారు మున్నగు యెందరో విద్వాంసులున్నారు.

తెలంగాణా లో రెండవ తెలుగు పత్రికగా వెలుగొందిన ‘కాకతీయ’ పత్రికను నడిపిన ఘనత వీరికే దక్కుతుంది. ఈ పత్రికా నిర్వహణలో మాజీ విదేశాంగ శాఖా మాత్యులు శ్రీ పి.వి. నరసింహారావు గారు కూడా వీరితో కలిసి పనిజేసారు. ఈ పత్రిక పోలీసు చర్యకు ముందు మూడేళ్లు, వెనుక మూడేళ్లు నడుప బడింది. ఆ రోజుల్లో జనం లో చైతన్య స్ఫూర్తిని పెంచగలిగే రచనల్ని గుప్పించడం, అలాంటి రచనల్ని సమీకరించి వాటి సందేశాన్ని జనంలోకి చొప్పించడం అనే విధి బాధ్యతలు అంత సులభమైన పనులుగావు.

పోలీసు చర్య, అనంతరం కమ్యూనిస్టులను ‘కనిపిస్తే కాల్చివేత’ ధోరణిలో పోలీసు ఉత్తర్వులు జారీయైనాయి. నాటి మిలిటరీ అధికారులు ముష్కర కర్కశులు, నంజప్ప అనే అధికారి దారుణ మారణకాండను సృష్టిస్తున్న వేళ, జనం భయం భయంగా దయనీయంగా దౌర్జన్యాలకు బలియౌతున్న వేళ, తుపాకి గుళ్ళకు గురి అవుతున్న వేళ, ప్రజలకోసం నేనున్నానని ఆ రాక్షసత్వాన్ని మొండిగా ఎదురొడ్డి జనంలో చైతన్యాన్ని దండిగా కలిగించిన ధైర్యశాలి, శ్రీ సదాశివరావు గారు. ఆ రోజులలో తెలంగాణా ప్రజల పౌరస్వాతంత్ర్యానికి కాకతీయ పత్రిక ఆందోళన సాగించింది.

శ్రీ పాములపర్తి సదాశివ రావు గారు కొద్ది కాలం అభ్యుదయ రచయితల సంఘంలో పని జేసారు. వీరు ‘చరిత్ర, సంస్కృతి, కళ’, తత్వశాస్త్ర ప్రాధమిక పాఠాలు, భారతీయ సాహిత్య పరిశీలన, అభ్యుదయ గీతాలు, మరియూ 1857 లో జరిగిన గదర్ విప్లవం పై గ్రంధాలు వ్రాయడం తోపాటు జ్ఞాన సిద్ధాంత మనే మరొక ఉద్గ్రంధమును వెలువరించారు. (పై సమాచారం శ్రీ టి. శ్రీరంగస్వామి గారి వరంగల్లు రచయితల వాఙ్మయ జీవిత సూచిక లో లభ్యమయ్యింది). కాని, ఆ ప్రతులేవీ ప్రస్తుతం దొరకడం లేవు. వారు కూడా వాటిని భద్రపరిచే పని చేయలేదు.

వీరు చైనా దాడి సందర్భంగా “విశ్వజ్యోతి” పత్రిక లో వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికలల్లో పునర్ముద్రణల ద్వారా విశేష ప్రచారంలోకి వచ్చినవి. క్యూబా విప్లవం ముఖ్యంగా రెజిస్ డెబ్రీ భావాలు అనే రచనలను విశ్వజ్యోతి పత్రిక ద్వార ప్రచురించి విప్లవకారులకు మార్గదర్శనం గావించారని ఆ పత్రిక సంపాదకులు శ్రీ కే. నరసింహా రెడ్డి గారన్నారు.

నేడు ప్రప్రధమ సోషలిస్టు దేశమైనా సోవియట్ లో గోర్బచేవ్ నాయకత్వాన మన్నింపబడుతున్న కమ్యూనిస్టు పార్టీలోని ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే అంశాల్ని శ్రీ పాములపర్తి వారు “సందేశం” పత్రిక లో ‘వ్యక్తి స్వాతంత్ర్యం పై చర్చ’ అనే రచన ద్వార ఆనాడే రేకెత్తించారు. కాని కొందరు నాయకులు ఈ ఆలోచనలనీ ప్రతిఘటించడం లాంటి అనుభవాలు జరిగాయి. అప్పటి నుండి తానూ పార్టీ రాజకీయాలకు దూరమవ్వడం జరిగింది.

వీరు భాషా రాష్ట్రాల వాదనను బలపరచారు. విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందానికి ప్రభుత్వం తిలోదకాలిచ్చిన సందర్భంలో దాని వివరాలను వెలుగులోకి తెస్తూ, తెల్నగ్నా హక్కుల ఉద్యమం కోసం వారు వ్రాసిన ఒకే ఒక్క వ్యాసం ఒరుగాల్లునే గాక తెలంగాణా అంతటా ముసురుకొని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వర్గాలను హడలెత్తించింది, గడగడలాడించింది.

వీరి కలానికున్న శక్తి గొప్పది. వరంగల్లు పురపాలక సంఘం తొలి ఎన్నికలు జరిగే సమయాన కాంగ్రెస్ నాయకులను వీరు తన కలంతోను, ప్రజాబలంతోను తీవ్రంగా యెదుర్కొన్నరు. పౌర సంఘాన్ని స్థాపించి శ్రామిక శక్తుల ప్రతినిధుల గెలిపించుకున్నారు.

శ్రీ పాములపర్తి గారు ఉత్తమ జర్నలిస్టు. ఎన్నో పరికలలో వారి వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ప్రాచీన సాహిత్యంతో సహా, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలైన ఎలక్ట్రానిక్ వంటి విషలాలు గూడ వీరికి పరిచయాలు. శాస్త్రీయ సంగీతం పట్ల అత్యంత అభిమానం ఉంది. యే విషయాన్నైనా సమూలమైన, సమగ్రమైన అవగాహనతో వివరించగలరు. వీరి కలం యెందరో మహా మహులైన రాజకీయనాయకులు, మంత్రుల, రచయితల సభా ఉపన్యాసాల్ని తయ్యారు చేసింది. ఎన్నో పత్రికల్లో రచనల్ని మెరుగులు తీర్చింది. అయితే ఆ కలానికి అనేక పేర్లున్నాయి. అసలు పేరు వెల్లడించడంలో ఆ కలానికి ఆసక్తి ఉండదు.

వీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక మంది పండితుల ప్రశంసలను చూరగొన్నారు. ప్రపంచ విజ్ఞాన రంగంలో గణుతికెక్కారు. పోతన ఉత్సవాలలో కార్య విధానాలను తీర్చి దిద్దారు. విద్యారణ్య విద్వత్ గోష్టిని నిర్వహించారు.

కార్మిక రంగం లోను శ్రీ సదాశివరావు గారి సేవ ఉంది. ఆజంజాహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యదర్శిగా ఆయన ఒక జయప్రదమైన సమ్మెను నిర్వహించారు. చేనేత, గీత పారిశ్రామిక సహకార సంఘ ఉద్యమాలలో వీరి సారధ్య సలహాలు ఎన్నో విజయలాకు దారులు తీసాయి.

తాను నమ్మిన దాని కోసం అవిశ్రాంతంగా శ్రమించడం, నిస్వార్ధతతో పనిచేయడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. వీరు ఆంద్ర తెలంగాణాల లోని పలు జిల్లాలలో రాజకీయ శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కమ్యూనిస్టు ఉద్యమాలలో నేరుగా పాల్గొన్నారు.

వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారు. మెడికల్ కాలేజీ (వరంగల్లు) లో జరిగిన కొన్ని వర్ణాంతర వివాహాలకు వీరి ప్రోత్సాహం ఉంది. భూసంస్కరణల ఉద్యమానికి చేయూతనిచ్చి, భూసంస్కరణల చట్టం కొరకు ఆందోళన సాగించారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే ఉద్యమంలో శ్రీ తెన్నేటి విశ్వనాధం గారితో కలిసి పని చేసి జైలుకు వెళ్ళారు.

ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొన్నారు. వరంగల్ మహబూబియా ఉన్నత పాఠశాలను నెలకొల్పటంలో కీలకపాత్ర వహించారు. ‘రాయిస్టు ఉద్యమం’, ‘మంత్రుల ఆడంబర వ్యతిరేక ఉద్యమం’ గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి ‘నాస్తికోద్యమం’ లాంటి కొన్ని ఉద్యమాలను వీరు బలపరిచారు.

శ్రీ రావుగారూ పౌరహక్కుల పరిరక్షణకు అగ్రగామిగా నిలిచి మానవహక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వ్యక్తి స్వాతంత్ర్యం కోసం పాటుపడుతూ, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేక పోరాటాలను సర్వదా బలపరుస్తూ తమ రచనల ద్వారా, సలహాల ద్వారా, బహుముఖాలుగా ప్రోత్సహిస్తున్నారు.

పౌర హక్కుల అమలును ఉల్లంఘించే ప్రభుత్వ ధోరణి అజ్ఞాత ప్రజా పోరాటాలకు, హింస ప్రతిహింసల దారుణానికి దారి తీస్తుందని వీరు చెబుతూ ఉంటారు.

“ఐక్యరాజ్య సమితిలో అమలయ్యే అధికారిక పధ్ధతి బూటకం, అది ఆచరణలో విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంద”ని వెక్కిరిస్తారు.

“వ్యక్తికి భావ స్వాతంత్ర్యం అవసరం, అది షరతులతో కూడుకొని ఉండరాదు. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్య అభివ్యక్తిగా ఉండి అన్ని రంగాలనూ ఆవరించే అవకాశం గుర్తించబదాల” ని ఉద్భోదించారు.

“ఇజాలను తెలుసుకోవడం అవసరమే, అయినా రాజకీయ పార్టీలు వాటిని అమలుపరచావు. కాబ్బట్టి ఆ పార్టీలనీ ప్రజలు అదుపు చెయ్యడానికీ అవకాసం ఉండాలి. అలాంటి ప్రజా ఉద్యమాలు అనివార్యం” అంటూ భావిస్తారు.

నేటి పత్రికలూ కేవలం వ్యాపార పత్రికలైనాయి. అనేక రంగాల్లో అవి సంక్షేమ విలోకనను సరిగా ప్రతిబింబించలేని స్థితి లో ఉన్నాయంటూ పత్రికాలోకాన్ని యీసడిస్తారు.

కవిత్వం ద్వారా సమాజం మారదు. కవి సమాజానికి అతీతంగా కూడ చూడగలగాలి. సాహిత్యంలో మానసిక జీవనం – దాని అనుభూతి వివరణ అనే మానవతా దృక్పధానికి ప్రాధ్యానత ఉండాలి అంటూ విశ్లేషిస్తారు.

ప్రజల సమస్త జీవిత రంగాల్లో వ్యక్తుల ఆత్మవిశ్వాసం, స్వతంత్ర్య స్వచ్చంద పాత్ర, కార్యకుశలత అనువాటికి గుర్తింపు పెంపోందాలనేది వీరి ఆశయం.

పేదరికానికి, యేకాకిత్వానికి, త్యాగాలకు ఆయత్తం కాలేని స్వార్థ పరత్వ శక్తులు సంఘ శ్రేయస్సును సాధించలేవని వీరు విశ్వసిస్తారు. పాలక వర్గ పోషణ యెపుడూ స్వాతంత్ర్య విస్తరణకు ప్రతికూల పాత్రకే దారి తీస్తుందని వీరి అభిప్రాయం. రాజకీయ పార్టీలు సామూహిక భావాలలోనూ, పార్టీ ఉద్యమాలలోనూ, ఎన్నికల సంరంభంలోనూ సాంఘిక వాస్తవ గుర్తింపు ‘మిధ్య’ మాత్రమేనని వీరు భావిస్తారు. సాంస్కృతిక చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే విధాన అనుసరణ కొరకు కృషి జరగాలని అభిలషిస్తారు.

పరిపాలనా వ్యవస్థకు ప్రజామోద ప్రణాలికా కార్యక్రమాలలో ప్రజల చొరవకు అవకాశం ప్రాధాన్యత చెందడం అవసరమని వీరి ఉద్ధేశ్యం; సంకుచిత తత్వంతో గాక విశాల దృక్పదం తో అన్వేశానాత్మక ఆచరణ ద్వారా మాత్రమె అభివృద్ధి సాధ్యపడుతుందని వీరు స్వాతంత్ర్య శీలతను వ్యాఖ్యానిస్తారు. పై విధంగా తమ ప్రత్యేకమైన విలోకనతో వారు జీవితాన్ని జీవిత సమస్యలను అర్థం చేసికోనడానికి ప్రయత్నిస్తారు.

కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించింది. దేశంలో జాతీయోద్యమ కాలనాటి సాంస్కృతిక రంగంలో కృషి చేసిన కొలది మంది ఉత్తమ వ్యక్తులలో వీరిని గుర్తించి వీరికి గౌరవభ్రుతి సౌకర్యాన్ని మంజూరు చేసింది.

ఏకశిలా ప్రతిభాపాటవాలకు, సాహిత్య సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన వీరి రచనలన్నీ ముద్రణలో వస్తే నవతరానికి ఉపయోగకరంకాగాలవు. ప్రభుత్వం కాని, విశ్వ విద్యలయలాలు కాని ఈ పనిని చేపట్టవలసి ఉండి. అప్పుడే సదశివరావుగారి సదాశాయాల్ని గౌరవించినవారం అవుతాం.

వరంగల్ జిల్లాలో రాజకీయ – సాంఘిక పరిణామాలు  (1939-1950)

– పాములపర్తి  సదాశివరావు 

భారత దేశంలో రెండు వందల ఏండ్ల బ్రిటిషు సామ్రాజ్యవాద వలస పరిపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం అనేక రూపాలలో విజృంభించింది.  

కేవలం బ్రిటిష్ ఇండియా ప్రాంతంలోనే కాకుండా స్వాతంత్య్ర పోరాటం ఆయా స్వదేశీ సంస్థానాలలో కూడా కొనసాగింది. నిజామ్ రాష్ట్రంలో ఆర్య సమాజం, ఆంద్ర మహాసభ, కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమాలు జాతీయ స్వాతంత్య్ర కొరకై వీరోచిత ఆందోళన ను నిర్వహించాయి. వీటితో బాటు వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, విద్యార్థి సంఘాలు, కూడా స్వాతంత్య్ర సంగ్రామంలో పరోక్ష పాత్ర నిర్వహించాయి. 

నిజాము పాలకుడు మ. ప. ప. మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను మొగలు సామ్రాజ్యానికి వారసుడిని అని భావించేవాడు. 85 శాతం హిందువులు కల రాజ్యం లో 85 శాతం ఉద్యోగాలు మహమ్మదీయులకే లభించాయి. ఉర్దూ భాషకే  ప్రాముఖ్యం ఉండేది. 

నిజాము పరిపాలన భూస్వామ్య వ్యవస్థను ప్రతీక. జాగీర్దారులు, సర్దేశముఖులు, దేశముఖులు, పటేల్, పట్వారీలు గ్రామాలలో నిరాంకుశాధికారాలు చెలాయించేవారు. వెట్టి చాకిరీ ,  నానా విధాలా మామూళ్లు అధికంగా ఉండేవి. గ్రామాలలో విద్య, ఆరోగ్యం వీటిని అశ్రద్ధ చేసేవారు. పెద్దల ద్వారా భూస్వాములు తమ కులాలు వారిని (వారిని) అనేక  విధాలుగా  అదుపులో పెట్టేవారు. నియమోల్లంఘనం చేసేవారిని వెలివేసి కష్టపెట్టేవారు. గ్రామాలలో పెద్దవారు ఆయుధాలు, పరివారం వగయిరా హంగులు కలిగి  అధికారులలో ముస్లిములు, ఉత్తరాది నుంచి వలస వచ్చిన కామస్తులు (కాయస్థులు) అధిక సంఖ్యలో ఉండేవారు. 

అఘోరనాథ్ ఛటర్జీ 

హైదరాబాదు లో కాంగ్రెసు ఉద్యమాన్ని మొదట నిర్వహించినవారు శ్రీమతి సరోజినీ  నాయుడు తండ్రి గారయిన శ్రీ అఘోరనాధ్ ఛటర్జీ. ఆ పిదప 1945 దాకా నిజాము రాజ్యంలో కాంగ్రెసు ఉద్యమం నిషేదానికి గురి అయింది. దరిమిలా  తెలంగాణా ప్రాంతంలోని జాతీయవాదులందరూ ఆంద్ర మహాసభలో పనిచేసేవారు – మాడపాటి హనుమంతరావు , బూర్గుల రామకృష్ణరావు , కొండా వెంకట  రంగారెడ్డి, మందుముల నర్సింగరావు, మాదిరాజు రామకోటేశ్వరరావు  , సురవరం ప్రతాపరెడ్డి మున్నగు జాతీయ నాయకులందరూ ఈ కోవకి చెందినవారే. 

వీరితో బాటు  యువతరానికి చెందిన శ్రీ జమలాపురం గోపాలరావు, రావి  నారాయణరెడ్డి,కాళోజి   నారాయణ రావు,కోదాటి  నారాయణరావు,బొమ్మకంటి సత్యనారాయణ రావు,  సర్వదేవర భట్టు రామనాధం , బి. ఎస్ . గుప్త, దాశరధి కృష్ణమాచార్య మున్నదగువారు ఆంధ్ర మహాసభ వేదిక పై అశేష జనాన్ని ఆకర్షించేవారు .

ఆ రోజుల్లో వరంగల్ సూబా (రాష్ట్ర ) కేంద్ర నగర స్థాయిని  కలిగి ఉండేది. ఇక్కడ  ప్రముఖ న్యాయవాదులయిన జమలాపురం గోపాలరావు,   పదసా రంగారావు, వేముగంటి రత్నాకర రావు, తూము రంగయ్య , తూము వరదరాజులు, కాళోజి రామేశ్వర రావు , ఉదయరాజు రాజేశ్వర రావు, చెరుకు కాంతయ్య మున్నగు ప్రముఖులు ఆంద్ర మహాసభ నాయకులుగా ప్రముఖ పాత్ర నిర్వహించారు. 

వీరి కృషి ఫలితంగా వరంగల్ లో శబ్దానుశాసన గ్రంధాలయము, హనుమకొండ లో రాజనరేంద్ర గ్రంధాలయం, మడికొండ లో ప్రతాపరుద్ర గ్రంధాలయం వంటి సంస్థలు స్థాపితమయినాయి. 

ఆంద్ర మహాసభ వేదిక ద్వారా సాంఘిక సంస్కరణలకును, రాజకీయ రాయితీల కొరకును , బాధ్యతాయుత ప్రభుత్వ సాధన కొరకును ఆందోళనలుజరిపేవారు . సభలకు  తీసికోవలసి వచ్చేది. సవాహలలో జరిగే రాజకీయ తీర్మానాల పటాలకు కూడా జిల్లా అధికారుల ఆమోదం అవసరం అవుతూ ఉండేది. కొన్ని సందర్భాలలో మైనారిటి వర్గానికి చెందిన ముస్లిం సోదరుల అభ్యంతరాల వలన నిషేధాలు వెలువడుతూ ఉండేవి. వారి ప్రతినిధి బహద్దూర్  యార్ జంగ్ మహమ్మదీయేతరుల ఉద్యమాలను వ్యతిరేకిస్తూ ఉండేవారు.        

అణా చందా 

1920లో ఆకారపు చెన్నయ్య , డాక్టర్ శివలెంక  రాజలింగం,మాదిరాజు రామకోటేశ్వర రావు , ఉదయరాజు వెంకటేశ్వర రావు, మున్నగు ప్రముఖులు వరంగల్ మార్కెట్ కు వచ్చు ప్రతి బండీ వద్దనూ ఒక అణా చందా వసూలు  చేసి త్రిలింగాయుర్వేద పీఠమును , ఒక గోరక్ష శాలను నిర్వహించుటకు తాలూక్దార్ వద్ద అనుమతి పొందినారు. ఈ సంస్థలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు డాక్టరు గా పనిచేశారు కానీ అభిప్రాయం బేధముల వలన అది త్వరలోనే అంతరించింది. 

1932 లో వరంగల్ కాకతీయ కాన్ఫరెన్స్ అనే పేరుతో ఒక సమావేశం జయప్రదంగా జరిగింది. నిర్వాహకులు ఆంధ్ర చరిత్ర పరిశోధక మండలివారు.  ఇటవంటి సందర్భాలలో జాతీయ భావోత్తేజన  కనపడుతూ ఉండేది. అధికారులు సయితం సానుభూతి తోనే వ్యవహరించేవారు. 

వరంగల్ లో ఏటేటా గణపతి విగ్రహ నిమజ్జనం జరిగేది. 1939 లో స్థానిక ముస్లిములు దీని విషయమై అభ్యంతరం కల్పించారు. వూరేగింపు నడి  దారిలో నిలిచిపోవలసి వచ్చింది. కొందరు హిందూ యువకులు గాయపడ్డారు. చివరికి తమ వూరేగింపూ మార్గాన్ని మార్చుకోడానికి హిందువులు ఒప్పుకోవలసి వచ్చింది. మతద్వేషాలు పెరిగాయి. ప్రభుత్వం పట్ల నిరసన భావం వ్యాపించింది. ఆ రోజులలోనే శ్రీ చందా కాంతయ్య గారు లక్ష రూపాయల విరాళంతో ఆంధ్ర విద్యాభివర్ధిని ఉన్నత పాఠశాలని స్థాపించారు. 

అప్పుడు సంస్కృత పాఠశాలలు, ఆయుర్వేద కళాశాలలు నిర్వహించడాన్ని జాతీయాభిమానానికి ప్రతీకలుగా భావించేవారు. వరంగల్ లో శ్రీ ముదిగొండ శంకరశాస్ట్రీ గారును, శ్రీ ముడుంబై రామానుజాచార్యులు గారును రామన్నపేట సంస్కృత పాఠశాల మరియూ సింహాద్రి భోగ్ సంస్కృత పాఠశాలను నిర్వహిస్తూ ఉండేవారు. శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రి గారు ఆయుర్వేద వైద్య శిక్షణ తరగతులను నడుపుతూ ఉండేవారు. 

1942 లో ఆంధ్ర మహాసభ లో విబేధాలు పొడసూపాయి. ఇవి జాతీయవాదులకూ, కమ్యూనిస్టులకూ మధ్య వచ్చాయి. ధర్మారం (వరంగల్) లో శ్రీ మాడపాటి రామకోటేశ్వర రావు అధ్యక్షతన నవమాంధ్ర మహాసభ జరిగింది. అప్పుడే భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగింది. ధర్మారం సభ అనంతరం ఆంధ్ర మహాసభ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒక శాఖకు జాతీయ వాదులు , మరొక శాఖకు కమ్యూనిస్టులూ నాయకత్వం వహించసాగారు. 

తిరిగి 1946లో గాని నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ మీద ఆంక్షలను తొలిగించలేదు. అప్పుడే జాతీయాంధ్ర సభ ప్రముఖులందరూ స్టేట్ కాంగ్రెస్ సంస్థలో చేరిపోయారు. 

ఉద్యమాలు 

కమ్యూనిస్టు యువకుల కృషి మూలముగా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలలో కార్మికోద్యమం , విద్యార్ధి యువజన సంఘటన గణనీయంగా కొనసాగాయి. ఆజాం జాహి మిల్స్ కార్మిక యూనియన్, బీడీ ఖమీక యూనియన్ నిర్మించారు. శ్రీ టీ . ఎల్ . నరసింహ రావు, రాజలింగమూర్తి, మాటేటి కృష్ణమూర్తి ఏంతో కృషి చేశారు. 

మరొక దిశన శ్రీ ఎం . ఎస్ . రాజలింగం సర్వోదయ ఉదయమాన్ని నిర్వహించారు . ఇందులో శ్రీ భూపతి కృష్ణమూర్తి, శ్రీ రామ్ చంద్రమౌళి , ముస్త్వాల  శంకర రావు , రంగనాయకులు , దుగ్గిసెట్టి  వెంకటయ్య మున్నగువారు నిర్మాణ కార్యకర్తలు గా ఉండేవారు. 

ఆర్యసమాజం సంఘటన లో శ్రీయుతులు చెరుకు కాంతయ్య, ఇటికెల మధుసూదన్ , పళ్ళ రామకోట్ ఆర్య, దేవరకొండ చంద్రమౌళి గారాలు ప్రముఖ పాత్ర నిర్వహించారు.   హనుమకొండలోను , వరంగల్ లోను ఏటేటా గజానన చవితి సందర్భాలలో వేలాది ప్రజానీకం తో ఉత్సాహంగా ఊరేగింపులు జరిపించేవారు. 

ఆ రోజులలో శ్రీ యుతులు రాయపు రాజు రామారావు , కక్కెర్ల కాశీనాధం , దేవులపల్లి దామోదర రావు మున్నగు యువకులు కాకతీయ కళా సమితి ద్వారా నాటకాలు , గానసభలు, కవిసమ్మేళనాలు నిర్వహించేవారు. వీరి కార్యకమాలకి ప్రభుత్వాదరణ లభించకపోవటంతో వర్తక ప్రముఖులు తగినంత ధన సహాయం చేస్తుండేవారు. కార్యక్రమాలు బాగా జరుగుతుండేవి. 

1947లో వరంగల్ లో ఒక దారుణమయిన సంఘటన జరిగింది. వరంగల్ కోట ప్రాంతంలో కాంగ్రెసు పతాకానికి వందన సమర్పణ జరుగుతుంది. స్థానిక మహమ్మదీయులకి ఆగ్రహ కారణం అయ్యింది. వారు ఒక వూరేగింపు చేశారు. ఆ సందర్భంలో బత్తిని మొగులయ్య అనే కార్యకర్తను ఈటె తో పొడిచి చంపివేశారు. ఎం. ఎస్. రాజలింగం , బి. హెచ్. చంద్రమౌళీశ్వర రావు మున్నగు కాంగ్రెసు కార్యకర్తలు ప్రాణాపాయానికి గురి అయి ఎలాగో తప్పించుకున్నారు. హత్య చేసినవారి మీద ప్రభుతవం చర్య తీసుకోలేదు. పైగా శ్రీయుతులు కాళోజి నారాయణరావు, ఎం. ఎస్. రాజలింగం, హయగ్రీవాచార్యులు వరంగల్ ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినారు. నగర ప్రజలలో కలవరపాటు పెరిగింది. 

1948లో సత్యాగ్రహాలూ మొదలయినాయి . స్టేట్ కాంగ్రెసు వారు నిజాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీటిని ప్రారంభించారు. సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చెయ్యాలన్న పిలుపు వచ్చింది. 

రాష్ట్రంలో కాంగ్రెసు , కమ్యూనిస్టు, ఆర్య సమాజం మున్నగు పురోగామి శక్తులను ఎదుర్కోవటానికి ముస్లిం వర్గీయులు శ్రీ ఖాసీం రాజవి నాయకత్వాన రజాకార్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ముఖ్యమయిన దినం 

జూన్  14, 1948 ఒక ముఖ్యమయిన దినం. ఆనాడు వరంగల్ లోని ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలో ఆర్య సమాజంవారు తమ కార్యాలయం మీద జండా ఎగురవేశారు. కోపం వచ్చి ముస్లింలు వారిపైన సాయుధంగా దాడి జరిపిన ఘర్షణ లో ఇరు పక్షాలలకూ చెందిన అయిదారుమంది మరణించారు. ఉద్రిక్తత తీవ్రస్థాయికి అందుకున్నది. మరునాడు హిందువులు సాయుధులై ఉర్సు కరీమాబాదు నుంచి రంగశాయిపేటకు వూరేగింపు తీశారు. ఇందులో చేనేత నాయకుల ప్రాధాన్యం అధికంగా ఉండినది. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో వీరు ఆత్మరక్షణ కొరకై నాటు బాంబులు మొదలైన ఆయుధాలను సమకూర్చికొనినారు. ఇటీవల మాణిక్యరావు ఆర్య సమాజం కమాండర్ గా కాశీబుగ్గ ఉర్సు కరీమాబాదు, వరంగల్ కోట ప్రాంతాలలో స్వచ్చంద దళాల సంఘటనను నిర్వహించినారు. కుసుమ నరసయ్య , పరిమళ నర్సయ్య, గుండు మల్లేశం, మాచేటి రామస్వామి చేనేత నాయకులలో ప్రముఖులు. నగరంలో రజాకారులు రెచ్చిపోయారు . హిందువుల మీద దాడి చేయడానికి సంకల్పించారు. 

రజాకారులు సాయుధులై ఒక వూరేగింపు తీశారు. ఎల్లమ్మ బజారులో ఒక దుకాణాన్ని దోచుకున్నారు. డాక్టరు నారాయణ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయనను పొడిచి చంపారు. దారిలో ఒక టాంగా గుర్రాన్ని చంపారు. ఆర్య సమాజ మందిరం మీద విధ్వంసకాండ జరిపారు. ప్రముఖ వర్తకుల ఇండ్ల ముందు తుపాకులు పేల్చారు. వీధులలో రంకెలు వేస్తూ వీరవిహారం జరిపారు. 

ఈ అరాచకాలకు ప్రతిఘటనగా కోట ఉర్సు కరీమాబాదు ప్రాంతం నుండి ఆర్య సమాజం వారు వూరేగింపు  తీశారు. రైల్వే గేటు  వద్ద ఘర్షణ జరిగి ఒక అరబ్బు చనిపోయాడు. పోలీసువారు అక్కడికి వచ్చారు. అక్కడ స్టేషను నుంచి వస్తున్నా గూడ్సు బండిని నిలిపి దాని వెనుక నుంచి తుపాకులు పేల్చారు. ముగ్గురు ఆర్య సమాజ కార్యకర్తలై ప్రాణాలు కోల్పోయారు. 

దీనంతటి వల్ల వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో పెద్ద సంచలనం చెలరేగింది. న్యాయవాదులు న్యాయస్థానాలని బహిష్కరించారు. స్టేట్ కాంగ్రెస్ వారు సాయుధ ఘర్షణకు పిలుపు ఇచ్చారు. కమ్యూనిస్టులు ఆయుదాయాలు చేబూని గ్రామాలలో భూములని పంచె కార్యక్రమానికి పూనుకున్నారు. శ్రీయుతులు హయగ్రీవాచారి, కే. వి. నరసింగ రావు గారాలు విజయవాడలోనూ, చాందాలోనూ పోరాటం దళాలను నిర్వహించారు. 

పరకాలలో పోలీసు కాల్పులు  13 మంది ప్రాణాలని తీశాయి. గురుమూరులో 12 మంది మరణించారు. అక్కడ రజాకారులు ఆడవారిని వివస్త్రాలుగా చేసి వారిని వూరేగించారు. వేలాదిమంది నిజామురాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకి వెళ్లి అక్కడ తలదాచుకున్నారు.  ఇక నిజాము రాష్ట్రములో అందరూ ఘర్షణకి సిద్ధం కావటంతో అక్కడ శాంతి భద్రతలు నశించి పోయాయి. రజాకారులు రెమిడిచర్ల హ్రామాన్ని తగులబెట్టారు. భారత ప్రభుత్వం నిజాము రాజ్యం మీద ఆర్ధిక దిగ్భందం విధించింది. దానితో పెట్రోల్, కిరోసిన్ మొదలైన వస్తువుల కొరత ఏర్పడింది. 

1948 సెప్టెంబరు 17 నాడు భారత ప్రభుత్వం హైద్రాబాదు మీద పోలీసు చర్య తీసుకుంది. జైలులో ఉంటున్న శ్రీయుతులు ఎం. ఎస్. రాజలింగం, చంద్రమౌళీశ్వరరావు , కాళోజి నారాయణ రావు , ఇటికెల మధుసూదన్ , అడవాల సత్యనారాయణ మున్నగు కాంగ్రెస్ కార్యకర్తలు విడుదలయ్యారు. 

నిర్వాస ప్రదేశాల నుండి శ్రీయుతులు హయగ్రీవాచారి, ఎస్. మనోహర రావు, మాదిరాజు కోటేశ్వర రావు, పండిత రుద్రదేవ్, చెరుకు కాంతయ్య ప్రభృతులు తిరిగి వరంగల్ చేరుకున్నారు. 

జనరల్ జె. ఎస్. చౌదరి నెలకొలిపిన మిలిటరీ ప్రభుత్వం నిజాము రాష్ట్రంలో శాంతిభద్రతలు కోలుకోవటానికి దోహదం కల్పించింది. 

పోలీసు చర్య పిదప కూడా కమ్యూనిస్టులు తమ భూముల పంపకం ఉద్యమాన్ని విరమించుకొనలేదట. వారు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండిపోవడంతో మిలిటరీ గవర్నర్ పరిపాలన మార్పుచెందలేదు. కాంగ్రెస్ పార్టీలో సయితం స్వామిజీ గ్రూపు , బూర్గుల గ్రూపు మధ్య స్పర్ధలు ఉంటూ ఉండేవి. తుదకు వెల్లోడి సివిల్ గవర్నర్ ఉంటున్నప్పుడు నలుగురు కాంగ్రెసు మంత్రులను తీసుకున్నారు.  శ్రీయుతులు బూర్గుల రామకృష్ణ రావు, దిగంబర రావు బిందూ , ఎ . బి . రాజు, వినాయక రావు, విద్యాలంకార్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మంత్రివర్గం 1952 లో ఎన్నికల దాకా కొనసాగింది. దరిమిలా కాలంలో వేలాది కమ్యూనిస్టులను కారాగార గృహాలనుంచి విడుదల చేశారు. వారు తమ భూ-పోరాటాన్ని విరమించుకొని ఎన్నికలలో  పాలుగొనటంతో శాంతి భద్రతలు ఏర్పడినాయి.   ఎన్నికల తరువాత శ్రీ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వం అవతరించింది. స్వామీజి గ్రూపు వత్తిడి మూలంగా ముఖాయమంత్రి శ్రీ రామకృష్ణ రావు రాష్ట్రంలో భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. నేత, గీత ఉద్యమాలు సహకార రంగంలో చేరిపోయాయి. 

అప్పుడే శ్రీ ఆకారపు నరసింగరావు వారి దాతృత్వంతో వరంగల్ స్టేటన్ పై విశ్వేశెరాయాలం, విష్వఈశ్వర సంస్కృతాంధ్ర కళాశాల , అనంత లక్ష్మి ఆయుర్వేద కళాశాల , సుశీలాదేవి ప్రాధమిక పాఠశాల స్థాపించబడి స్థిరమైన పునాదుల మీద నిలబడగలిగాయి. 

జనాకర్షణ 

ప్రజాస్వామ్య పద్దతి మీద ఎన్నికలు రావటంతో శాసనసభ్యులు , స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం విశేషంగా జనాన్ని ఆకర్షించాయి. 

కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిన పిదప జాతీయవాదులలో స్వచ్ఛంద సేవాసక్తి తరిగిపోయి వృత్తి రాజకీయాలు, పదవుల తాపత్రయాలు పెరిగిపోయాయి. రాజకీయాల ద్వారా ధనాన్ని , సత్తాను పెంపొందించుకొనాలనే దృక్పధం సర్వత్రా వ్యాపించింది. శిక్షణ కార్యక్రమాలు, సేవారంగం త్యాగపూరిత ఉద్యమాసక్తి లోపించసాగాయి. సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం సంస్థల ద్వారా జరుగుతూ ఉండటం చేత పదవీ రాజకీయాలు తెరి వెలియడం కూడా సహజమే. 

ఇది భూస్వామ్య , ధనిక వర్గ రాజకీయ ప్రాబల్యానికి దారి తియ్యటంలోను అబ్బురమేమీ లేదు. 

పై విధంగా 1940-50 ల మధ్య జరిగిన జాతీయ స్వాతంత్రోద్యమంలో తెలంగాణాకు చెందిన జిల్లాలకు స్ఫూర్తి దాయకమైన కేంద్రంగా వరంగల్ విభిన్న రంగాలలో బహుముఖ పాత్రను నిర్వహించివుంది. 

Published in Andhra Patrika between February 6-8 1984

Retrieved from archive.org:

https://archive.org/details/ANDHRAPATRIKA06021984/page/n3/mode/2up

https://archive.org/details/ANDHRAPATRIKA07021984/page/n3/mode/2up

https://archive.org/details/ANDHRAPATRIKA08021984/page/4/mode/2up

మేడ గది ఏడుస్తోంది

-పాములపర్తి నిరంజన్ రావు

This poem was read in the ‘Sri Pamulaparthi Sadasiva Rao memorial meeting’ held on 15-09-1996  held by Warangal district journalists union and presided over by Sri Kaloji Narayana Rao  )

నేస్తం,

ఈ  చిన్న మేడ  గది  నుండే

అభ్యుదయ బాటలో  గేయాలు  పాడుతూ,

తత్వ  శాస్త్ర  పాఠాలు,

జ్ఞాన  సిద్ధాంతాలు  బోధించావు…

అంధకార  ప్రవృత్తిలో  నడుస్తున్న  చరిత్రకు

చైతన్య  కళా  సంస్కృతి  దీపాన్ని చూపించావు…

అధ్వైతానికీ, మార్క్సుకూ  అవినాభావ  సంబంధం  గుర్తించావు,

బుద్ధ  తత్వ  సందేశాన్ని అందరికీ  పంచావు…

నైమిశారన్యపు  విజ్ఞాన  సుగంధ  వీచికలతో

భారత  పునరుజ్జీవన  పరిమళాన్ని చిందించావు…

మహాత్ముణ్ణి  మరిచి  మల్టీ నేషనల్  భ్రమలో  పడ్డ

‘విజయునికి’  అంతులేని  ‘జయో’పదేషాన్ని  గావించావు

* * *

ఈ  గదిలోనే

రూపొందాయి  పెండ్యాల  రాఘవునితో  ఎన్నికల  ప్రణాలికలు;

కూర్చబడింది  గురు రాఘవుని  ‘పరిదేవనాని’ కి  శిష్య  పీఠిక;

వినిపించాయి ‘కన్నీటి  కవి’  కాళోజీ  గుండెలోంచి  ప్రజా  ‘గొడవలు’;

పొంగి  పొర్లాయి  ‘కాకతీయ’లో  అద్భుత  నవరసాలు;

వ్యాపించింది  నలుదిసల  ‘విశ్వజ్యోతి’  రచనా  విన్యాసం;

జరిగింది  పోతన  భాగవత  సందేశామృత  మధనం;

వీణా  నాదమైంది  శ్రావ్యంగా  విద్యారణ్య  విద్వద్ గోష్టి

* *  *

ఈ  గది  మెట్ల  మీదుగా  పైపైకి  ప్రాకి

నీ  మది  తలుపులు  తట్టాయి

అనుముల  ఆస్తిక వాదం,  గోరా  నాస్తిక  వాదం;

‘షాద్’  కాళోజి  ఉర్దూ  కవిత్వం, దేవులపల్లి  ఆంధ్ర  సారస్వతం;

కోవెల  చేతనామృతం,  వరవరుని  సృజనాత్మకం;

తెన్నేటి  ఉక్కురాజకీయం, చలసాని  చిత్రకళామయం;

కటంగూరు  విశ్వ  కుటీరం,  సంపతుని  నైమిశారణ్యం;

అన్నింటికీ  స్పందించింది  నీ  కళాత్మక హృదయం

పంచి  ఇచ్చింది  అందరికీ  నీ  ఆలోచనామృతం…

* *  *

ఈ  చిన్న మేడ  గదిలో

ఆకలిని  అర  కప్పు  ‘చాయ్’తో  పారద్రోలి,

సిగరెట్టుల  సూపు  త్రాగుతూ  జీర్నించుకున్నావు  శాస్త్ర  గ్రంధాలెన్నో…

నిరంతర  అధ్యయన  మధనాన్ని గావించి,

వెలికి  తీసావు  సంగీత  సాహిత్య  అమృత  కలశం…

బక్క  చిక్కిన  శరీరపు  బొక్కసంలో  దాచావు  అంతులేని  జ్ఞాన  సంపద…

పంచి  ఇచ్చావు  నీ  మేధా  సంపత్తి  ఇక్కడకు  అరుదెంచిన  అందరికీ…

*  *  *

మిత్రమా,

విలువలను  గాలికొదిలేసి,

వీధుల  వెంటా,  వేదికల  పైనా

కృత్రిమ  వేషాల్ని, ఆడంబరంగా అభినయించలేక

సామాన్యుడిగా,  సహజ  జీవిగా

ఈ  గదికే  పరిమితమయ్యావు

నీ  మది  గవాక్షాలు  తెరచి

అన్ని  ‘ఇజాల’  పక్షులను  స్వేచ్ఛగా  రానిచ్చావు,

ఏ  ‘ఇజానికి’  లొంగని  నైజాన్ని ప్రదర్శించావు

సర్వ  స్వతంత్ర  ‘సదాశివుస్తుడిగా’  నిలిచావు

వేదం,  తత్వం;

వినోదం,  విజ్ఞానం

సంగీతం,  శాస్త్రం

కళలూ,  కవిత్వం

ఇదీ, అదీ  అనక  అన్ని  రంగాల

అధ్యయనంలో  మునిగి  సాగించావు  ఆలోచనలు

జీవించావు  ఒక  క్రొత్త  చిత్ర  విచిత్ర  శైలిలో

***

నా ప్రాణమా,

నీ  నిజాయితీ  ఊపిరి  బలానికి  ఆయాసపడింది  ‘అస్తమా’;

నీ  నిర్భీతి గొంతు  గాంభిర్యానికి  మూగవోయింది  ‘కాన్సెర్’  …

అయినా నీ  స్వేచ్ఛా  పిపాసికతను   అడ్డుకునే యత్నం  సాగలేదు  ఎంతో  కాలం

అందుకే  జీవన  శృంఖలాల్ని తెంచుకుంటూ

‘రాజహంస’ లా  ఎగిరిపోయావు, ‘స్వీయాభిరామాయణాన్ని’ మాకు  వదిలి …

నీవు  లేకున్నా,

నీవు  వినిపించిన  విజ్ఞానపు  రాగాలను  పాడుతూ,

నీవు  నింపిన  సాహిత్య  స్రవంతిలో  తేలియాడుతూ,

అభ్యుదయ  పథంలో  సాగిస్తాను ఈ  జీవితాన్ని  ఆదర్శవంతంగా…

… మేడ గది

A brief note:

Sri Pamulaparthi Sadasivarao, who was considered as “Walking encyclopaedia”,  had spent almost 50 years of his life (he lived for 76 years) in a bungalow room (meda gadi) of his house in a small lane beside fire station at Matwada, Warangal. He used to lie down in a half moon style on the bed with resting his back o pillows and used to read and write in the posture of  “half moon”. He was a voracious reader of many books and was a frequent writer. He was a great thinker, philosopher, music lover, writer, speaker and what not!

Give  him any topic and he can touch all angles of that topic and can continuously give a discourse, that too  an authoratitive one, on it by giving a wide range of references.

Because of his keen interest on Hindusthaani and Carnaatic music he started ‘Kaakatiya kalaasamithi’ in 1950 and with the support of other eminent personalities like organize ‘Thyaagaraaja mahosthwaalu’
every year in Warangal and eminent musicians like Maharajauram Santhaanam, Baalamurali krishna’ came down to Warangal to participate in these utsavs.

He started publishing some literary articles under ‘Kankatiya Samkalanalu’ in 1942, which later on was converted into the famous weekly magazine ‘KAKATIYA PATRIKA” in 1949, which was considered as ‘TELANGANA PUTHRIKA’ during those days. He along with Sri P.V. NARASIMHA RAO ran that weekly news magazine  for about a decade, which was very popular and powerful with realistic journalistic values. Both were called ‘JAYA- VIJAYULU’ and their guru (master) was Late Sri GAARLAPAATI RAGHAVA REDDY GARU. His another disciple was the famous ‘Prajakavi’ Sri KAALOJI  NAARAAYANA RAO, who was treated as ‘big brother” (PEDDAANNA) by both Jaya-vijayas.

During 1960s & 1970s he wrote a number of articles in ‘VISHWA JYOTHI”, a monthly magazine edited by late Sri Katanguru Narasimha Reddy, a great freedom fighter.

Sri P.V. and Sri   Sadasiva rao were best friends and each loved the other in spite of different ideologies. He used to write frequent letters to  Sri P.V. giving his opinions and thoughts and suitably advising him. Sri P.V.  always sought his opinions on various issues, appreciated and used to adopt the ideas given by him with in his practical political limits. Both used to write letters to each oteher and shared their ideas on literature, philosophy, education and political and social matters.

He was dead against the ‘World bank and multi national” way Sri P.V., as  prime minister of India wanted to lead the country. He used to say that this leads to the Prime minister of India reaching a low stage of carrying  the brief cases of the World bank authorities. He wanted India to develop like India by retaining its glorious philosophy, culture, traditions, history and not blindly copying  others ruining our past glory.

The ‘meda gadi’ is a meeting place of various eminent personalities and various important discussions, discourses and decisions..

Some of his important literary works:

1.      CHARITRA –SAMSKRITHI – KALA  (1952)

2.      TATHWA SASHTRA PATHAALU    (1954)

3.      Abhudaya geyaalu   (1958)

4.      Gnaana sidddhantham (1960)

He was the person who initiated, planned and organized “POTHANA PANCHASHATHI UTSHAVAALU”  at Warangal during 1982 and later “VIDHYAARANYA VIDWAD GHOSTHI” in 1987.

Most of his life, he experienced poverty, but he never felt ashamed of poverty and lived a simple life confined to the meda gadi reading and writing. People of various walks of life used to meet him in meda gadi for obtaining the information on the topic of their interest. He was like a encyclopedia kept in a glass almirah of a library and interested persons approached to get vast information from this encyclopedia.

He was lean and used to consume a number of teas and was a heavy smoker of ‘chaarminar’ cigarettes. He was suffering from ‘asthma’ for a large period of his late years and was attacked by  ‘throat cancer’ in 1995. In spite of his ill health, during the last part of his life he gave some wonderful weekly lectures for about a decade on every Sunday  on ‘Bharatha punarujjeevanam’ touching the various  topics of Indian and western  philosophies at  Sampath Rajaram gardens at Warangal,   which was named as ‘NIMISHAARANYAM’.   He died on 26th August 1996.

Close Bitnami banner
Bitnami